జగన్ సాక్షి : రేటు పెంచటం ఎందుకు? ఏం జరుగుతోంది?
ఈ రోజు మొదటి పేజ్ లో 'ఏదో ఏదేదో చాలా' చెప్పేసి ఒక్క అర్ధరూపాయి మాత్రమే పెంచుతున్నాము అని చావు కబురు చల్లగా చెప్పారు జగన్ గారు ....
ఈ సాక్షి పత్రికలో గత కొద్ది రోజులుగా వచ్చిన మార్పుల గురించి ఇంకొక టపాలో చర్చిద్దాం ..
ప్రస్తుతానికి పెంచిన ధర గురించి మాట్లాడదాం.
"ఈనాడు" circulation కుడి ఎడంగా ఒక 12 లక్షలు ఉంటుంది అధికారిక లెక్కల ప్రకారం .. సరే ఈ సాక్షి దానిని అధిగమించినా/మించకపోయినా కనీసం ఆ సంఖ్యను చేరుకుంది అనుకున్నా కూడా .....
ఇప్పుడు పెంచింది 50 పైసలు ...
పెంచకపోతే రోజు వారీ భరించవలసిన నష్టం : 12 లక్షలు * 0.50 = 6 లక్షలు
నెలకి : 30 * 6 లక్షలు = ఒక కోటి 80 లక్షలు.
ఒక నాలుగు అయిదు నెలలలో ఎన్నికలు అయిపోవటం .. కొత్త ప్రభుత్వం/ముఖ్యమంతి ఎవరో తెలిసిపోతుంది ..
ఎవరొచ్చినా ... ఈ లోపు అంటే ఒక అయిదు నెలలలో రమారమి ... 5 * ఒక కోటి 80 లక్షలు = 10 కోట్లు
ఇప్పటి వరకు వచ్చిన పుంఖానుపుంఖలంగా ప్రచురించిన అవినీతి వార్తలను బట్టి చూసినా లేక జగన్ కున్న కొద్దో గొప్పో ఆస్తులను బట్టి చూసుకున్నా .. 10 కోట్లు భరించలేడా ? అంటే నష్టాలు చూపిస్తే నిజంగా కొంపలు మునిగిపోతాయా?
ఏం జరుగుతోంది?
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..