జగన్ సాక్షి : రేటు పెంచటం ఎందుకు? ఏం జరుగుతోంది?

Posted by తెలుగు'వాడి'ని on Thursday, January 8, 2009

ఈ రోజు మొదటి పేజ్ లో 'ఏదో ఏదేదో చాలా' చెప్పేసి ఒక్క అర్ధరూపాయి మాత్రమే పెంచుతున్నాము అని చావు కబురు చల్లగా చెప్పారు జగన్ గారు ....

ఈ సాక్షి పత్రికలో గత కొద్ది రోజులుగా వచ్చిన మార్పుల గురించి ఇంకొక టపాలో చర్చిద్దాం ..

ప్రస్తుతానికి పెంచిన ధర గురించి మాట్లాడదాం.

"ఈనాడు" circulation కుడి ఎడంగా ఒక 12 లక్షలు ఉంటుంది అధికారిక లెక్కల ప్రకారం .. సరే ఈ సాక్షి దానిని అధిగమించినా/మించకపోయినా కనీసం ఆ సంఖ్యను చేరుకుంది అనుకున్నా కూడా .....

ఇప్పుడు పెంచింది 50 పైసలు ...

పెంచకపోతే రోజు వారీ భరించవలసిన నష్టం : 12 లక్షలు * 0.50 = 6 లక్షలు
నెలకి : 30 * 6 లక్షలు = ఒక కోటి 80 లక్షలు.

ఒక నాలుగు అయిదు నెలలలో ఎన్నికలు అయిపోవటం .. కొత్త ప్రభుత్వం/ముఖ్యమంతి ఎవరో తెలిసిపోతుంది ..  

ఎవరొచ్చినా ... ఈ లోపు అంటే ఒక అయిదు నెలలలో రమారమి ...  5 * ఒక కోటి 80 లక్షలు = 10 కోట్లు

ఇప్పటి వరకు వచ్చిన పుంఖానుపుంఖలంగా ప్రచురించిన అవినీతి వార్తలను బట్టి చూసినా లేక జగన్ కున్న కొద్దో గొప్పో ఆస్తులను బట్టి చూసుకున్నా .. 10 కోట్లు భరించలేడా ? అంటే నష్టాలు చూపిస్తే నిజంగా కొంపలు మునిగిపోతాయా?

 ఏం జరుగుతోంది?



విషయ సూచికలు :


10 వ్యాఖ్యలు:

Anonymous on Jan 8, 2009, 10:10:00 AM   said...

చివరికి పుచ్చొంకాయల ధర కూడా పెంచేస్తున్నారన్నమాట!


Anil Dasari on Jan 8, 2009, 10:40:00 AM   said...

ఏం జరుగుతుందో మనకెందుగ్గానీ ..

ఎన్నాళ్లకెన్నాళ్లకి పునర్దర్శనం!?! ఏం జరిగింది?


Anonymous on Jan 8, 2009, 4:43:00 PM   said...

ఎలా ఉన్నారు?
భావున్నారా?
ఆమధ్య జ్యోతక్క కనపడటంలేదని ప్రకటన ఇద్దామని అనుకున్నారు.
:)


Ramani Rao on Jan 10, 2009, 2:39:00 AM   said...

ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు..... స్వాగతం తెలుగూ 'వాడి'ని గారు!! :-)


Telugu Movies UPdats on Jan 10, 2009, 6:24:00 PM   said...

సాక్షి కి సోమ్ములు ఇచ్చే SATYAM ని తిరగతిప్పి MYTAS చెస్తె రెండు బోర్ల పడ్డయి మరి


Ramani Rao on Jan 11, 2009, 5:55:00 AM   said...

ఇంతకు ముందు నేను కామెంట్ రాసినట్లు గుర్తు.??? రాలేదా? పబ్లిష్ చేయలేదా? మర్చిపోయారా తెలుగు 'వాడి 'ని గారు?


Anonymous on Jan 21, 2009, 6:19:00 AM   said...

నా డి.టి.పి. సెంటర్ యాడ్ కూడా సాక్షిలో ఇస్తుంటాను. గతంలో నాలుగు లైన్ల యాడ్ కి నాకు 60 రూ. ఖర్చయ్యేది, ఇప్పుడు 70 రూ. ఖర్చవుతోంది. ఒక లైన్ అదనంగా వేస్తే 15 రూ. అదనంగా ఖర్చవుతుంది. ఈనాడులో ఇప్పుడు కూడా యాడ్ కి 100 రూ. (5 లైన్లకి) ఖర్చవుతుంది. వ్యాపారులు ఎక్కువగా సాక్షిలోనే యాడ్స్ వేస్తున్నారు. కేవలం సాక్షి పేపర్ వల్ల కాదు, మార్గదర్శి కుంభకోణం వల్ల కూడా ఈనాడు సర్క్యులేషన్ పడిపోయింది. ఒకప్పుడు మా ఊర్లో ఈనాడు, వార్త పేపర్లు ఎక్కువగా అమ్ముడుపోయేవి. సాక్షి వచ్చిన తరువాత ఈనాడు రెండో స్థానానికి దిగిపోయింది. మార్గదర్శి కుంభకోణం, సాక్షి ఈ రెండూ ఈనాడు పై ప్రభావం చూపించాయి.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting